telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రజావేదికను కూల్చివేయాలి.. అధికారులకు జగన్ ఆదేశాలు

jagan

ఏపీలోని ఉండవల్లి ప్రజావేధిక పై కలెక్టర్ల సదస్సులో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయ వివాదంగా మారిన ప్రజావేదికపై జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ భవనంలో ఇదే చిట్టచివరి మీటింగ్ అని సీఎం అధికారులతో చెప్పారు. అక్రమ కట్టడాల కూల్చివేత ప్రజావేదికతోనే మొదలు అని సీఎం జగన్ తన వైఖరిని స్పష్టంగా చెప్పేశారు.

జూన్ 26వ తేదీన ప్రజావేదికను కూల్చివేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. ప్రజావేదిక చంద్రబాబు నివాసం పక్కనే ఉండటం గమనార్హం. ఎస్పీల సమావేశం తర్వాత అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని సీఎం తెలిపారు. మనం అందరం కూర్చున్న ఈ భవనం చట్టబద్ధమైన నిర్మాణం కాదని కలెక్టర్లతో జగన్ పేర్కొన్నారు.

Related posts