ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆయనకు ఇప్పటికీ వెంటిలేటర్పై ఉంచే చికిత్స అందిస్తున్నామని ఆర్మీ ఆసుపత్రి తాజా బులెటిన్లో పేర్కొంది. ప్రస్తుతం ఆయన కోమాలోనే ఉన్నారని వివరించింది. ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో చికిత్స అందిస్తున్నామని తెలిపింది.
ఆయన గుండెతో పాటు కిడ్నీ సంబంధిత అవయవాల పనితీరు బాగానే ఉందని ఆర్మీ ఆసుపత్రి తన బులెటిన్ లో వివరించింది. కాగా, ప్రణబ్ ముఖర్జీకి కొన్ని రోజులుగా వెంటిలేటర్పైనే చికిత్స అందుతోంది. మెదడుకు వెళ్లే నాళాల్లో రక్తం గడ్డకట్టడంతో ఆయనకు ఇటీవల సర్జరీ చేశారు.