telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మార్కాపురం సమీపంలో జరిగిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు.

ఈరోజు తెల్లవారుజామున రాయవరం గ్రామ సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఘటన తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు మార్కాపురం జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు.

గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులకు సూచించారు.

Related posts