థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ భళ్ళున నవ్వించే హాస్యనటుడు పృథ్వీరాజ్ ఇటీవల రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్నాడు. ఇప్పటి వరకు వైసీపీ గురించి ఎవరు విమర్శించినా వారికి గట్టిగ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. దీనితో, తాజాగా, ఆ పార్టీ పృథ్వీరాజ్ కు కీలక పదవి లభించింది. వైసీపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా పృథ్వీరాజ్ ని నియమించారు. ఈ మేరకు హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఏపీలో వైసీపీ నిర్వహించిన కార్యక్రమాల్లో పృథ్వీరాజ్ చురుగ్గా పాల్గొన్నారు. ఇటీవల జగన్ పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజెప్పేందుకు కృషి చేస్తానని, త్వరలో వీధి నాటకాలు ప్రదర్శిస్తానని పృథ్వీరాజ్ ప్రకటించారు.
నా సోదరుడికి జగన్ అంటే ప్రాణం: పూరీ జగన్నాథ్