మొదట్లో బిజినెస్ పీపుల్తో రాజకీయ నాయకులు మాట్లాడే వారు కాదని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్తామంటే వెళ్లొదని.. అలా వెళ్లడం వల్ల ప్రజల్లో ఒక భావన ఏర్పడుతుందని వారు సూచించే వారని ఆయన పేర్కొన్నారు.
అయినా తాను పలుమార్లు దావోస్కు వెళ్లానని.. పారిశ్రామికవేత్తలో మాట్లాడి రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానించానని ఆయన చెప్పారు.
బుధవారం విజయవాడ నగరంలో ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గతంలో నాటి ప్రధాని పీవీ నరసింహరావు ప్రపంచీకరణ కు అనుమతి ఇవ్వడంతో ఆర్ధిక వ్యవస్థ చక్కబడిందని ఆయన తెలిపారు.
గత ప్రధాని పీవీ నరసింహారావు కంపల్షన్ వల్ల అలా చేశారని చెపుతున్నప్పటికీ.. దీని వల్ల దేశానికి మేలు జరిగిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం మనం క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడుతున్నామన్నారు. ఫిక్కీ 100 ఏళ్లకుపైగా ఉన్న సంస్థ అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
అంతకు ముందు ఈ సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబును ఫిక్కీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఫిక్కీ ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రభుత్వ చేపడుతున్న చర్యలు.. అమలు చేస్తున్న పాలసీలు ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉంటున్నాయని ఫిక్కీ ప్రతినిధులు ప్రశంసించారు. ఎంఎంస్ఎంఈల విషయంలో చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం తీసుకుంటున్న చొరవకు వారు అభినందనలు తెలిపారు.
స్వర్ణాంధ్ర విజన్ 2047ను సాకారం చేసేందుకు తమ వైపు నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రభుత్వానికి ఫిక్కీ జాతీయ కార్యవర్గం హామీ ఇచ్చింది.


టీడీపీ కాపులనువాడుకుని వదిలేసింది: మంత్రి బొత్స