telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..

ఏపీ అసెంబ్లీ నుంచి మరోసారి టీడీపీ సభ్యులు సస్పెండ్‌ అయ్యారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు నినాదాలతో ఏపీ అసెంబ్లీ హోరెత్తించారు.

జే బ్రాండ్‌లపై విచారణ, జంగారెడ్డి గూడెం సంఘటనకు సంబంధించి న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు పొడియం వద్ద నినాదాలు చేశారు. పలుమార్లు పోడియం వద్దకు రావద్దని స్పీకర్ హెచ్చరించారు. అయినప్పటికీ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.

ఈ నేపథ్యంలో స్పీకర్ మాట్లాడుతూ ‘సభకు సభ్యులుగా ఉన్న మీరు ప్రశ్నోత్తరాలలో పాల్గొంటారని ఎదురు చూశాం.. మీరు సభ గౌరవాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ  నలుగురు టీడీపీ సభ్యులను ఈనెల 25 వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

బెందాళం అశోక్, వెలగపూడి రామకృష్ణబాబు, రామరాజు, అనగాని సత్యప్రసాద్‌లను సభ నుంచి సస్పెండ్ చేశారు.మొత్తం నలుగురు సభ్యులను ఈ సెషన్ వరకు సస్పెండ్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు.

Related posts