telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్టణంలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్టణంలో పర్యటించనున్నారు.

మహిళా ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన ‘స్వస్థ్ నారీ – సశక్త్ పరివార్ అభియాన్’ పేరుతో నిర్వహించే పలు కార్యక్రమాలలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని సాగరికా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపులను ముఖ్యమంత్రి సందర్శిస్తారు.

ఆ తరువాత మధ్యాహ్నం 12 గంటలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్న ‘స్వస్థ్ నారీ – సశక్త్ పరివార్ అభియాన్’ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు.

అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాడిసన్ బ్లూ హోటల్‌లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బిజినెస్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

అక్కడే నెదర్లాండ్స్, ఫ్రెంచ్ దేశాలకు చెందిన ప్రతినిధుల బృందంతో చంద్రబాబు నాయుడు విడివిడిగా సమావేశమవుతారు. రాత్రి 7:40 గంటలకు విశాఖపట్నం పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి అమరావతికి బయలుదేరతారు.

Related posts