ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఇవాళ చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించి, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని స్వయంగా పరిశీలించనున్నారు.
పర్యటనలో భాగంగా ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్లోని గ్యాప్ 1, గ్యాప్ 2 నిర్మాణాలు, బట్రస్ డ్యామ్, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ వంటి పనులను ఆయన తనిఖీ చేస్తారు.
అనంతరం జలవనరుల శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ప్రాజెక్టు పనులు, కుడి, ఎడమ కాలువల అనుసంధానం వంటి అంశాలపై చర్చించి, తదుపరి లక్ష్యాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం ఇవ్వాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రాజెక్టు సివిల్ పనులు 88 శాతం మేర పూర్తయ్యాయి.
ఈ పర్యటన ముగించుకుని, ఆయన రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు.


రాష్ట్రంలో రాక్షస పాలన.. వైసీపీ సర్కార్ పై గోరంట్ల ఫైర్