ఇటీవల బీహార్ అసెంబ్లీలో పోటీ చేసిన ఏఐఎంఐఎం, ఆ పొరుగు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లో తన ఉనికిని చాటడానికి సిద్దం అవుతోంది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలో 2021లో జరిగే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పావులు కదుపుతోంది.
అంతకంటే ముందు ఆ రాష్ట్రంలో నగరపాలిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జనవరిలో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు బెంగాల్ మజ్లిస్ అధ్యక్షుడు జమీరుల్ హసన్ వెల్లడించారు. పశ్చిమబెంగాల్లో పార్టీని బలోపేతం చేయడానికి అసదుద్దీన్ ఒవైసీ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ, ఇతర సీనియర్ నాయకులు అక్కడి జిల్లాల్లో పర్యటిస్తారని హసన్ చెప్పారు.