ఏపీలో వివిధ రకాల క్యాన్సర్లను నియంత్రించేలా కార్యాచరణ చేపడుతున్నట్టు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలో కేన్సర్ వ్యాధిని నోటిఫై చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించిందని అన్నారు.
ముఖ్యమంత్రి క్యాంపు గురువారం ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణులు, ఏపీ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడితో కలిసి కాన్సర్ స్క్రీనింగ్ అట్లాస్ ను సీఎం విడుదల చేశారు.
వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయిలో స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించి రూపొందించిన ఈ అట్లాస్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా తొలిదశలో 2.9 కోట్ల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి నమోదు చేసిన వివరాలతో ఈ అట్లాస్ ను రూపొందించారు.
విజన్ స్టేట్మెంట్ ద్వారా 2030 నాటికి అడ్వాన్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్, మిషన్ స్టేట్మెంట్ ద్వారా ముందస్తు స్క్రీనింగ్లతో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను తగ్గించేలా అట్లాస్ ద్వారా కార్యాచరణ చేపట్టబడుతుంది.
హెల్త్ ఎడ్యుకేషన్, క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన, ప్రివెన్షన్, స్కీనింగ్, ఎర్లీ డిటెక్షన్ క్యాన్సర్ కేర్ స్ట్రాటజీలో వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పురుషులు, మహిళల నుంచి నమోదు చేసిన సమాచారం ఆధారంగా చికిత్సలు, సర్జికల్, రేడియేషన్, మెడికల్ ట్రీట్మెంట్ వారిగా అట్లాస్లో వివరాలు పొందారు.
రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ఏ ప్రాంతంలో ఎంతమంది, ఏ రకమైన క్యాన్సర్ ఉన్నారో గుర్తించేందుకు, స్థానికంగా చికిత్సలు అందుబాటులోకి రావడానికి వీలుగా సమాచారం తెలిసేలా ఈ అట్లాస్ కు రూపకల్పన చేశారు.

