telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు డయాస్పోరా సమావేశంలో ప్రసంగించారు.

దావోస్ కు నేను తొలిసారి వచ్చినప్పుడు భారతీయులే తక్కువగా ఉన్నారు తెలుగు వాళ్లు అసలు లేరు.

కానీ ఇప్పుడు తెలుగు వారు ఉండడమే కాదు వచ్చిన వారిని చూస్తే విజయవాడలో ఉన్నామా ? తిరుపతిలో ఉన్నామా ? అనేలా ఉంది 20 దేశాల నుంచి తెలుగు వారు ఉన్నారు అన్నారు.

195 దేశాల్లో తెలుగు వారు ఉన్నారు 148 దేశాల్లో ఎన్నార్టీ వ్యవస్థను ఏర్పాటు చేశాం. విదేశాల్లో ఉన్నా తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ సంక్రాంతి పండుగ జరుపుకున్నారు కోడిపందాలు తప్ప అన్ని సంప్రదాయాలను పాటించారు.

విజన్ 2020, ఐటీ గురించి నేను మాట్లాడిన రోజుల్లో అందరూ విమర్శించారు. కానీ నేను ఆనాడు తీసుకున్న నిర్ణయం వల్ల 195 దేశాలకు తెలుగు వారు వెళ్లడానికి అవకాశం కల్పించింది.

తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలను ప్రారంభించడం గర్వకారణం. 2047కు భారత దేశం ప్రపంచంలో నెంబర్ ఎకానమీ దేశంగా అవతరిస్తుంది.

భారత దేశానికి అత్యంత బలమైన నాయకత్వం నరేంద్ర మోదీ రూపంలో ఉంది. ఉన్నత విద్యను అభ్యసించిన వారిని… యువకులను పార్టీలో, ప్రభుత్వంలో ప్రొత్సహిస్తున్నాం. అందుకే లోకేష్, రామ్మోహన్నాయుడు, టీజీ భరత్ వంటి వారికి పదవులు దక్కాయి.

రామ్మోహన్నాయుడు కేంద్రంలో యంగెస్ట్ కెబినెట్ మంత్రి. సవాళ్లను ఎదుర్కోవాలి ఇబ్బందులను అధిగమించాలి దీన్ని యువత నేర్చుకోవాలి.

పదవులు వస్తే గ్లామరే కాదు  రాళ్లు కూడా పడతాయ్  వీటిని ఎదుర్కొవడం యువత అలవరుచుకోవాలి.
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్లు ప్రభావితం చూపే కమ్యూనిటీగా ఎదగాలి.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్నార్టీలు అద్భుతమైన పని చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ సహకరించారు… అలాగే బీజేపీ కూడా కలిసి వచ్చింది.

రాష్ట్రానికి పూర్వవైభవం తేవాలి సహకరించమని ఎన్నార్టీలను కోరితే  ఆలోచన చేయకుండా తరలి వచ్చారు… కూటమి కోసం పని చేశారు.

రాష్ట్రంలోని నేతలు, కార్యకర్తలతో సమానంగా కొందరు ఎన్నార్టీలు కూడా కేసులు పెట్టించుకున్నారు.
ప్రజల ఆశీస్సులు, మీ సహకారంతో 93 శాతం స్ట్రైక్ రేట్ తో అద్భుత విజయం సాధించాం.

విధ్వంసమైన రాష్ట్రాన్ని తిరిగి పునర్ నిర్మించడం సాధ్యమా ? అని అందరూ ఆందోళ చెందారు.
కానీ 18 నెలల కాలంలో బ్రాండ్ పునరుద్దరించాం  స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో పని చేస్తున్నాం.

అభివృద్ధి విషయంలో మంత్రులు, నేను పోటీ పడ్డాం పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించాం.
దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వచ్చాయి అన్నారు.

Related posts