కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ లో భేటీ అయ్యారు.
కరవు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు, సాగునీటి అవసరాల కోసం గోదావరి వరద జలాల మళ్లింపు కోసం చేపట్టే పోలవరం – నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు.
గోదావరి నదికి వచ్చే వరద జలాల్లో 200 టీఎంసీల నీటిని పోలవరం ఆనకట్ట నుంచి నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తరలించటమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు.
“రోజు న్యూఢిల్లీలో గౌరవనీయులైన కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ జీని కలవడం ఆనందంగా ఉంది.
పూర్వోదయ వంటి కేంద్ర కార్యక్రమాల మద్దతుతో, ఆంధ్రప్రదేశ్ తూర్పు భారతదేశానికి ప్రధాన వృద్ధి చోదక శక్తిగా ఎదగగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.
SASCI ద్వారా నిధుల మద్దతు, రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా అభివృద్ధి చేయాలనే మా ప్రణాళికలకు మద్దతు మరియు మన రాష్ట్ర దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి కేంద్ర బడ్జెట్ సహాయం కూడా నేను అభ్యర్థించాను” అని చంద్రబాబు ట్వీట్ చేసారు

