telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జీవనోపాధి లేక పేదలు ఇబ్బందులు: జగన్ కు చంద్రబాబు లేఖ

chandrababu

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో జీవనోపాధి లేక పేదలు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం పనుల నిలిపివేత, పెండింగ్ బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. కూల్చివేతలు, నిలిపివేతలు, రద్దులతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని విమర్శించారు. రాజకీయాలకు తెరదించి, ఉపాధిహామీ పనులకు నిధులను విడుదల చేయాలని అన్నారు.

పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. గత నాలుగు నెలలుగా జరుగుతున్న పరిణామాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని చెప్పారు. కూలీల జీవనోపాధికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. టీడీపీ హయాంలో కన్వర్షన్ విధానంతో 22 శాఖల్లోని నిధులను మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకానికి అనుసంధానించామని… అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేశామని లేఖలో వివరించారు.

Related posts