మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. వైఎస్ వివేకానందరెడ్డి సహజ మరణం కాదని ఆయన పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మీడియాతో మాట్లాడుతూ, సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అదనపు ఎస్పీ లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
వివేకానందరెడ్డి మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులను ప్రత్యేకంగా రప్పిస్తున్నామని చెప్పారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీమ్, డాగ్ స్వాడ్ క్షుణ్ణంగా పరిశీలించిందని తెలిపారు. మృతికి కారకులైన వారి పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో వివేకా మృతి ఘటన ఇప్పటికే రాజకీయ రంగు పులుముకొంది. టీడీపీ నేతలపై కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ పై లక్ష్మీ పార్వతి ఫైర్