దేశవ్యాప్తంగా ఢిల్లీ నుంచి పలు రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను నడపాలని నిర్ణయించిన కేంద్ర రైల్వే శాఖ అందుకు సంబంధించిన షెడ్యూల్ను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. కేవలం ఐఆర్సీటీసీ వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకునే వారికి మాత్రమే ప్రయాణ సదుపాయం ఉంటుందని రైల్వే శాఖ మరోమారు స్పష్టం చేసింది. ప్రత్యేక ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు సంబంధించి రైల్వే శాఖ ప్రకటించిన తాజా జాబితాలో తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రెండు రైళ్లు మాత్రమే స్టాప్స్లో ఆగుతాయి.
Passenger services on Indian Railways shall be partially restored w.e.f. from 12th May 2020 in a graded manner. 15 pairs of special trains shall be operated to 15 cities. Only online E-Ticketing will be done through IRCTC website. See attached list.https://t.co/HSfscqd7GQ pic.twitter.com/fUjBiTndDj
— Ministry of Railways (@RailMinIndia) May 11, 2020
మే 13న న్యూఢిల్లీ నుంచి చెన్నై సెంట్రల్కు వెళ్లే రైలు తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, వరంగల్ రైల్వే స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. మే 12న న్యూఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లే రైలు తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం, గుంతకల్లు జంక్షన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్కు ప్రత్యేక రైలు ఉన్నప్పటికీ అది కేవలం తెలంగాణలో సికింద్రాబాద్లో మాత్రమే ఆగుతుంది. ఈలోపు తెలంగాణలో ఉన్న రైల్వే స్టేషన్లలో ఏ ఒక్క చోట స్టాప్ లేదు. పరిమిత స్టాప్స్ విషయంలో రైల్వే శాఖ తీసుకున్న ఓ నిర్ణయమైతే స్పష్టమైంది. ఈ ప్రత్యేక రైళ్లు రాష్ట్రానికో స్టాప్లో మాత్రమే ఆగుతాయి. అయితే.. ఏపీకి ప్రత్యేకంగా రైలు లేకపోవడంతో అనంతపురం, గుంతకల్లు జంక్షన్లో ఆగేందుకు వెసులుబాటునిచ్చారు.