“గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి మరియు ప్రతి గ్రామ పంచాయతీకి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము.
ఆ దిశలో ఒక పెద్ద అడుగు వేస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ భారత్ నిధితో సహకార ఒప్పందం (MoC)పై సంతకం చేసింది.
సవరించిన భారత్నెట్ ప్రాజెక్ట్ ద్వారా గ్రామీణ డిజిటల్ కనెక్టివిటీని వేగవంతం చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక ముఖ్యమైన భాగస్వామ్యాన్ని సూచిస్తుంది” అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేసారు.
ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ₹2,432 కోట్లు కేటాయించింది.
రాష్ట్రంలోని మొత్తం 13,426 గ్రామ పంచాయతీలకు కనెక్టివిటీ అందించనున్నారు. ఇందులో 480 కొత్త పంచాయతీలు కూడా ఉన్నాయి.
దీని కోసం ‘ఆంధ్రప్రదేశ్ భారత్ నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్’ (APBIL) అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.

