telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అస్వస్థత ఆయన హైదరాబాద్‌కు తరలింపు

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారు అస్వస్థతకు గురయ్యారు.

ఫిబ్రవరి 26 (గురువారం) రాత్రి ఆయనకు మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ (తేలికపాటి పక్షవాతం) వచ్చినట్లు సమాచారం.

వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ఆయనను అమరావతి నుండి హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా  ఉందని, ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు ధృవీకరించారు. ఒకట్రెండు రోజుల్లో ఆయనను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం జరుగుతున్న శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లో బొత్స గారు చురుగ్గా పాల్గొంటున్నారు.

ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలియడంతో వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గారు ఇతర పార్టీ నేతలు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

Related posts