telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

శాసనమండలిలో మరోసారి అస్వస్థతకు గురైన బొత్స సత్యనారాయణ

శాసనమండలిలో జరుగుతున్న చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతుండగా అస్వస్థతకు లోనయ్యారు.

సభలో ప్రసంగిస్తున్న సమయంలో బొత్స తీవ్రంగా ఇబ్బంది పడటాన్ని గమనించిన మంత్రి పయ్యావుల కేశవ్ వెంటనే స్పందించారు.

బొత్స ఇబ్బందిని గుర్తించిన మంత్రి పయ్యావుల  ప్రసంగాన్ని కాసేపు నిలిపివేసి, కూర్చుని విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

ఈ క్రమంలోనే అసెంబ్లీ అధికారులు వెంటనే వైద్యులను మండలికి పిలిపించారు.

అక్కడికి చేరుకున్న వైద్య బృందం అసెంబ్లీ ఆవరణలోని డిస్పెన్సరీలో బొత్సకు పలు రకాల పరీక్షలు నిర్వహించింది.

రక్తపోటు (బీపీ)లో హెచ్చుతగ్గుల కారణంగానే బొత్స అస్వస్థతకు గురయ్యారని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు విశ్రాంతి చాలా అవసరమని వైద్యులు స్పష్టం చేశారు.

అస్వస్థత నేపధ్యంలో అసెంబ్లీ వైద్యులు  బొత్సకు రెగ్యులర్ గా చికిత్స అందించే స్పెషలిస్ట్ డాక్టర్లతోనూ మాట్లాడారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

 

Related posts