“సాహస వీరుడు – సాగర కన్య”, “ఆజాద్” మొదలగు తెలుగు చిత్రాల్లో నటించి టాలీవుడ్ లో కుడి అభిమానులను సంపాదించుకున్న నటి శిల్పాశెట్టి. ఈ బాలీవుడ్ భామ శిల్పాశెట్టి మే 8న అంటే ఈరోజు తన పుట్టినరోజు వేడుక చేసుకుంటోంది. ఇది ఆమెకు 44వ పుట్టినరోజు. ఒకానొక్కప్పుడు శిల్ప తన ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని వార్తల్లో నిలిచింది. అలాగే ఆమె టాప్ హీరోయిన్గా ఉన్న సమయంలో హీరో అక్షయ్ కుమార్తో అఫైర్ ఉందంటూ వార్తలు వ్యాపించాయి. శిల్ప 2009 నవంబరు 22న బిజినెస్మ్యాన్ రాజ్కుంద్రాను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ వియాన్ అనే కుమారుడు ఉన్నాడు. వివాహ సమయంలో శిల్పాకు రాజ్కుంద్రా రూ. 3 కోట్లు ఖరీదుచేసే రింగ్ బహుకరించారు. తరువాత ఆమెకు దుబాయిలోని బుర్జ్ ఖలీఫాలో 19వ ఫ్లోర్లోని ఒక అపార్ట్మెంట్ను కానుకగా ఇచ్చారు. ఇంగ్లాండ్లోనూ వీరికి ఒక ఖరీదైన భవనం ఉంది. అలాగే ముంబైలో సీ-ఫేసింగ్ విల్లాను రాజ్కుంద్రా ఆమెకు కానుకగా ఇచ్చారు. కాగా శిల్ప బ్రిటీష్ రియాలిటీ షో “బిగ్ బ్రదర్-5″లో విజేతగా నిలిచారు. 1993లో బాలీవుడ్లో “బాజీగర్” సినిమాతో చిత్రరంగంలో కాలుమోపిన శిల్ప అదే ఏడాది విడుదలైన “మై ఖిలాడీ తూ అనాడీ” సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్నారు. శిల్పా ఇప్పటివరకూ హిందీ, తెలుగు, కన్నడ, తమిళం మొదలగు భాషల్లోని సినిమాల్లో నటించారు. ఇప్పుడు బుల్లితెరపై పలు షోలకు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.
“శాశ్వతంగా లాక్-డౌన్”… రానా పెళ్లిపై అక్షయ్ కుమార్ రియాక్షన్