ఎన్నికలు అయిపోయాక కూడా బీజేపీ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్న కెసిఆర్ పద్దతి మార్చుకోవాలి. సిద్దిపేటలో బీజేపీ కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేస్తూ భయబ్రాంతులకు గురి చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్రమంగా అరెస్టు చేసిన కార్యకర్తలను వెంటనే విడుదల చెయ్యాలి. దుబ్బాకలో ఓటమి భయంతో మొన్నటిదాకా రోజుకోరకంగా ఇబ్బందులకు గురి చేసి, ఓటమి తప్పదని అక్కసుతో మా కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్న కెసిఆర్ ప్రభుత్వానికి, తెరాస నాయకులకు తిప్పలు తప్పవు. ఉప ఎన్నికలో దుబ్బాక సీటు తర్వాత తన సీటుకు ఎసరు వస్తున్నదన్న భయంతో కెసిఆర్ ఇదంతా చేస్తున్నారని స్పష్టం గా అర్థమవుతుంది. కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్న రాక్షస క్రీడలో భాగమే ఈ అరెస్టులు. అక్రమ అరెస్టులు మానుకోకపోతే తర్వాత పరినామాలు తెరాస ప్రభుత్వం అంచాన కూడా వెయ్యలేరని హెచ్చరిస్తున్నాం. ప్రజలు తిరగబడే రోజులు దగ్గరే ఉన్నాయి, ఆ పరిస్థితి కెసిఆర్ ప్రభుత్వం కొనితెచ్చుకోవద్దు జాగ్రత్తా అంటూ బండి సంజయ్ హెచ్చరించాడు.
previous post
next post


కేసీఆర్కు రైతుల ఉసురు తగులుతుంది: ఎంపీ కోమటిరెడ్డి