భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జీవితంపై సినిమా రూపొందనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. భారతదేశానికి ప్రధానిగా ఆయన ఎనలేని సేవలు అందించి కీర్తి ప్రతిష్ఠలు సొంతం చేసుకున్నారు. కాగా వాజ్ పేయి బీజేపిలో కీలకంగా వ్యవహరించారు. ఆయన 2018 ఆగస్టు 16న ఆయన కన్నుమూశారు. ఆకాష్ ఫిల్మ్స్ అధినేతలు శివాశర్మ, జీషన్ అహ్మద్లు ఈ విషయాన్ని ప్రకటించారు. ఇందుకోసం ప్రముఖ రచయిత ఎన్పీ రాసిన “ది అన్టోల్డ్ వాజ్ పేయి” పుస్తకానికి సంబంధించిన హక్కులను కొనుగోలు చేసినట్లు తెలిపారు. వాజ్ పేయి బాల్యం, కాలేజీ రోజులు, రాజకీయ నాయకునిగా మారడం… ఇలా అతని జీవితంతో ముడిపడిన పలు అంశాలను ఈ చిత్రంలో చూపించనున్నట్లు తెలిపారు. వాజ్ పేయి పై చిత్రాన్ని రూపొందించాలనేది తమ చిరకాల వాంఛ అని, ఇప్పుడది కార్యరూపం దాల్చబోతున్నదని తెలిపారు. సినిమాకు సంబంధించిన స్క్రిప్టింగ్ పనులు ప్రారంభమయ్యాయని, ఇవి పూర్తయ్యాక దర్శకుడు, నటులను ఎంపిక చేయనున్నామని తెలిపారు. త్వరలోనే నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు ప్రకటించనున్నారు.
next post
మూడు పెళ్లిళ్లు అని అవమానిస్తే హ్యాపీగా ఉందా? అంతా ఆ సన్నాసి వల్లే… : పూనమ్ కౌర్