కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రం “కేజీఎఫ్”. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యువ నటుడు యష్ హీరోగా నటించారు. ఈ చిత్రం కన్నడలోనే కాక తెలుగు, తమిళం, హిందీ భాషలలో మంచి విజయం సాధించింది. దాదాపు 200 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించి అన్ని ఇండస్ట్రీలని షాక్కి గురి చేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా చాప్టర్ 2ని భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. చిత్రంలో ముఖ్య పాత్రలలో రమ్యకృష్ణ, సంజయ్ దత్, ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్.. ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. అయితే..తాజాగా ఈ మూవీ నుంచి ఓ వార్త వైరల్ అవుతోంది. “కేజీఎఫ్-2” లో బాలకృష్ణ నటిస్తున్నట్టు ఓ వార్త బయటకు వచ్చింది. అంత భారీ సినిమాలో బాలయ్య లాంటి హీరో నటిస్తున్నారంటే క్రేజ్ మామూలుగా ఉండదు. అందుకే కేజీఎప్-2 లో బాలయ్య నటిస్తున్నారనే విషయం సంచలనంగా మారింది. నిజానికి కేజీఎఫ్-2 లో బాలయ్య నటిస్తున్నారని చిత్ర బృందం ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ.. గూగుల్ మాత్రం కేజీఎఫ్-2 సినిమా నటీనటుల జాబితాలో బాలయ్య పేరును చేర్చేసింది. అంతేకాదు… బాలయ్య “ఇనాయత్ ఖలీల్” అనే పాత్రలో నటిస్తున్నట్టు కూడా ఖరారు చేసింది. నిజమేమిటంటే.. “ఇనాయత్ ఖలీల్” పాత్రలో వేరే నటుడికి బదులుగా పొరపాటున బాలయ్య పేరు వేసేసింది. దీంతో బాలయ్య పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
previous post