వినాయకచవితి దగ్గరపడుతున్న నేపథ్యంలో భక్తుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. కరోనా నేపథ్యంల ,ఉత్సవాలను ఎలా నిర్వహిస్తారో అనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయాలను తీసుకుంది.గణేశ్ విగ్రహాన్ని కేవలం 6 అడుగుల ఎత్తులో మాత్రమే తయారు చేయాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఈ ఏడాది లడ్డూ వేలంపాట నిర్వహించకూడదనే నిర్ణయానికి వచ్చారు.
ఈ ఏడాది భక్తులకు ఎలాంటి పూజలు, దర్శనాలు వద్దని నిర్ణయించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, తమ నిర్ణయాలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. శోభాయాత్ర నాటికి అప్పటి పరిస్థితులకు అనుకూలంగా నిర్ణయాలను తీసుకొంటామని తెలిపారు.

