ఏకాదశిని పురస్కరించుకుని చింతామణి రురల్ లో ఎన్.ఆర్.లే అవుట్లో బ్రహ్మచైతన్య శ్రీరామమందిరంలో వైకుంఠద్వార దర్శనం ఏర్పాటు చేయనున్నట్టు మందిరం అధ్యక్షుడు జి.హెచ్.వెంకటేశమూర్తి తెలిపారు. సోమవారం వేకువజామున 5.30గం టలకు కాకడ హారతి, 6.30గంటలకు వైకుంఠ ద్వార దర్శనం, సాయంత్రం 6.30గంటలవరకు విష్ణుసహస్రనామ పారాయణ ఉంటుందన్నారు. 6.30గంటలకు హైదదరాబాద్కు చెందిన ప్రముఖ గాయకుడు శ్రీకృష్ణ ఆదిత్య, శశాంక్ సోదరులచే శ్రీరామ గానామృతం ఉంటుం దన్నారు. భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసి స్వామి కృపకు పాత్రులు కావాలన్నారు. ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని శుక్రవారం ఆయన వివరించారు.
previous post