అడుగడుగునా అవాంతరాలు ఎదుర్కొన్నా… అఖండ సినిమా ఇబ్బందికర పరిస్థితుల్లో ఊహించని విజయాన్ని అందించిందని హీరో బాలకృష్ణ సంతృప్తి వ్యక్తంచేశారు. అఖండ సినిమా ప్రతినిధులతో ఆయన తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా… ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ప్రభుత్వం కొత్తనిబంధనలు తీసుకొచ్చినా… సాహసంతో విడుదలచేశామని తెలిపారు. సమాజంలో చోటుచేసుకున్న పరిణామాలతో అద్భుతంగా తెరకెక్కించిన బోయపాటి శ్రీను, ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగువేయని నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి సినిమా విజయాన్ని ఆస్వాధిస్తున్నారని తెలిపారు. తెలుగు ప్రేక్షకులు ఆదరించి అఖండ విజయాన్ని అందించారనే అభిప్రాయం వ్యక్తంచేశారు.
సమాజంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో గుళ్లూ గోపురాలకు సంబంధించిన అంశాలు గ్రామీణప్రాంత ప్రజానీకాన్ని ఆకట్టుకున్నాయని తెలిపారు. సినిమా సాగుతున్న నేపథ్యంలో సన్నివేశాల్లో ప్రేక్షకులు బాగా కనెక్ట్ కావడంతో అరుపులు, కేకలతో హర్షద్వానాలు అందుకోగలిగామన్నారు. సినిమా విజయం సాధించిన సందర్భంగా దైవదర్శనాలకు సినిమా టీమ్ ప్రాధాన్యత ఇచ్చిందన్నారు.
బెజవాడ కనకదుర్గమ్మ, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి, శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకున్నామని తెలిపారు. అఖండ సినిమాను ప్రేక్షకుల ఆధరించడం కొత్త ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక చింతనతో వచ్చిన సినిమాకు ఘన విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్ళకు ధన్యవాదాలు తెలిపారు.
ఎన్టీఆర్, అల్లుఅర్జున్ లతో సినిమా అంటే నిద్ర పట్టదు… నిధి అగర్వాల్