telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

వైసీపీ కూడా గతంలో ఎన్నికలకు దూరంగా ఉంది…

achennayudu tdp

ఏపీలో ప్రస్తుతం వరుస ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఓ ఎన్నికలు పూర్తయే సరికి మరొకటి వస్తున్నాయి. ఇక తాజాగా అక్కడ పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఈనెల 8 న ఎన్నికలు, 10 న ఫలితాలు ఉంటాయి.  అయితే, దీనిని సవాల్ చేస్తూ వివిధ పార్టీలు హైకోర్టును ఆశ్రయించాయి.  దీనిపై నేడు విచారణ జరుగుతున్నది.  ఇక ఇదిలా ఉంటె, పరిషత్ ఎన్నికలకు దూరంగా ఉండాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  బాబు నిర్ణయాన్ని కొంతమంది టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు.  ఎన్నికల్లో పోటీ చేసి తీరుతామని నేతలు చెప్తుండటంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు.  పరిషత్ ఎన్నికలపై చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని అన్నారు.  ఒకరిద్దరు నేతలు వ్యతిరేకించినా దానిని పరిగణలోకి తెసుకోవాల్సిన అవసరం లేదని, కుప్పం సహా కొన్ని చోట్ల కొందరికి ఇది నచ్చకపోవచ్చని, అధినేత నిర్ణయాన్ని అందరూ పాటించాలని అన్నారు. వైసీపీ నేతలు గతంలో చాలా ఎన్నికలకు దూరంగా ఉన్నారని, ఓటమి భయంతో వైసీపీ చాలాసార్లు పోటీ చేయనేలేదని తెలిపారు. అయితే చూడాలి మరి ఈ ఎన్నికలో ఏం జరగబోతుంది అనేది.

Related posts