ఏపీ మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనా భారీనపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల పార్టీలకు అతీతంగా నేతలు స్పందిస్తున్నారు. మాణిక్యాలరావు మృతిపట్ల సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని జగన్ చెప్పారు.
మాణిక్యాలరావుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. ఆయన అంత్యక్రియలపై పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్కు ఉత్తర్వులు జారీచేశారు. మాణిక్యాలరావు మృతదేహాన్ని నేరుగా తాడేపల్లిగూడెంకు బీజేపీ నేతలు తరలించారు. తాడేపల్లిగూడెంలోనే అంత్యక్రియలుకు కుటుంబసభ్యులు ఏర్పాటు చేశారు.
వాళ్లు కూడా మనుషులే… బ్లడీ స్టుపిడ్ పోలీస్