జపాన్కు చెందిన ప్రొటీరియల్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో తన తొలి స్టీల్ కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.
ప్రొటీరియల్ ఇండియా సంస్థ, తన అనుబంధ సంస్థ ‘మెట్ గ్లాస్ ఇండియా’ ద్వారా ఈ ప్రాజెక్టును చేపడుతోంది.
అల్లాయ్ రిబ్బన్ ను ఉత్పత్తి చేయనున్న ప్రొటీరియల్ సంస్థ.
తొలిదశలో 77 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్న సంస్థ, అక్టోబర్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు సీఈఓ వెల్లడించారు.
అధునాతన జపాన్ టెక్నాలజీని వాడనున్నట్టు తెలిపిన సీఈవో. తొలిదశలో ఏటా 30వేల టన్నులు ఉత్పత్తి చేయనున్న ప్లాంట్.
ఈ కర్మాగారం ఏర్పాటు కోసం సంస్థ సుమారు ₹1,350 కోట్లు ($148 మిలియన్లు) పెట్టుబడి పెట్టనుంది.
తిరుపతి జిల్లాలోని శ్రీసిటీ (Sri City) పారిశ్రామిక వాడలో ఈ యూనిట్ ఏర్పాటు కానుంది.
దేశంలోనే మొట్టమొదటిసారిగా ‘అమోర్ఫస్ ఎలక్ట్రికల్ స్టీల్’ ను ఇక్కడ తయారు చేస్తారు. ఇది విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో కోర్ లాస్ను 20-30% వరకు తగ్గించి, ఇంధన పొదుపుకు దోహదపడుతుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా తొలి దశలో సుమారు 200 మందికి, మొత్తం మీద 500 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభించే అవకాశం ఉంది.
ఈ ప్లాంట్ కోసం ప్రొటీరియల్ సంస్థ, దేశీయ ట్రాన్స్ఫార్మర్ తయారీ సంస్థ అయిన శిరిడీ సాయి ఎలక్ట్రికల్స్తోజతకట్టింది.


ఇళ్ల స్థలాల పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్: కళా వెంకట్రావు