telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సీఐడీతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారు: ప్రత్తిపాటి పుల్లారావు

ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని నిరూపణ చేయలేని వైసీపీ ప్రభుత్వం సీఐడీతో అక్రమ కేసులు నమోదు చేయించిందని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుందన్నారు. అమరావతి ప్రాంత రైతులపై సీఐడీ విచారణ చేపట్టడాన్ని ఆయన ఆక్షేపించారు.

బినామీలకు భూమిలిప్పించారని ఆరోపిస్తూ బెల్లంకొండ నరసింహారావు, నారాయణ, తనపై కేసులు పెట్టారని చెప్పారు. తాము ఏ తప్పు చేయలేదని.. ఎవరికీ భయపడేది లేదన్నారు.ప్రభుత్వం ఏదో ఒక కేసు పెట్టి టీడీపీ నేతలను ఇరకాటంలో పెట్టాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోందన్నారు. తప్పుడు కేసులు పెడితే.. తాము న్యాయ స్థానాలను ఆశ్రయిస్తామన్నారు. పరువు నష్టం కేసులు వేస్తామన్నారు. ఆధారాలు లేకుండా తమపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

Related posts