telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

యాంకర్ శ్వేతారెడ్డి.. కుటుంబసమేతంగా బీజేపీలోకి ..

anchor swetareddy joined in bjp

ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో తండ్రితో కలిసి యాంకర్ శ్వేతారెడ్డి కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా శ్వేతారెడ్డి మాట్లాడుతూ.. బిగ్‌బాస్ షో పై తాను పోరాడినప్పుడు కొందరు తప్ప ఎవరూ స్పందించలేదని, అలాగే ఏ రాజకీయ పార్టీ కూడా తనకు అండగా నిలబడలేదన్నారు. ఒక్క బీజేపీ, ఆ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాత్రమే తనకు అండగా నిలిచారని గుర్తు చేశారు. అలాగే, ఏబీవీపీ కూడా తనకు మద్దతుగా నిలిచిందన్నారు.

బీజేపీలో చేరినందుకు ఆనందంగా ఉందన్న శ్వేతారెడ్డి, ఇప్పటి వరకు జర్నలిస్టుగా ప్రజాసమస్యలపై గళం వినిపించానని, ఇప్పుడు బీజేపీలో చేరడం ద్వారా ప్రజల కోసం పోరాడతానని చెప్పారు. బిగ్‌బాస్ షోపై పోరాడినట్టుగానే రాష్ట్రంలోని సమస్యలపైనా పోరాడతానని శ్వేతారెడ్డి స్పష్టం చేశారు.

Related posts