telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

లేవని రోడ్డెక్కిన ప్రజలు.. పోలీసులతో వాగ్వాదం

Rajamundry

లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తు కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనే రాజమండ్రిలో చోటుచేసుకుంది. చిన్న పిల్లలు తాగడానికి మూడు రోజుల నుంచి పాలు లేవని ఆజాద్ చౌక్ లో స్థానికులు రోడ్డుపై ధర్నాకు దిగారు. ఆజాద్ చౌక్ ను రెడ్ జోన్ గా ప్రకటించి… అన్ని దారులను అప్పటికే అధికారులు మూసేశారు. దీంతో పాలతో పాటు నిత్యావసర సరుకులను తమకు పంపిణీ చేయడం లేదంటూ పోలీసులతో స్థానికులు గొడవకు దిగారు.

జైల్లో పెట్టినట్టు తమను అధికారులు బాధిస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో స్థానికులకు-పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.ఘర్షణ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పోలీసు బృందాలు మోహరించాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హుటాహుటాన ఆజాద్ చౌక్ చేరుకుని, వారికి పాలు, నిత్యావసర వస్తువులను అందించారు.

Related posts