కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా మరోసారి అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో గత రాత్రి ఆయనను కుటుంబసభ్యులు న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దాదాపు నెల రోజుల క్రితం కరోనా సోకిన తరువాత ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే.
55 ఏళ్ల వయసులో ఉన్న అమిత షా, గత రాత్రి తన ఒంట్లో నలతగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు ఎయిమ్స్ కు తరలించారు.ఆగస్టు 14న గురుగ్రామ్ లోని మేదాంతా నుంచి ఢిశ్చార్జ్ అయిన అమిత్ షా, వైద్యుల సలహా మేరకు తాను మరికొన్ని రోజులు హోమ్ ఐసోలేషన్ లో ఉంటానని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.