telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

రాఖీ పంపిన మహిళకు మోదీ ధన్యవాదాలు

modi on jammu and kashmir rule

రక్షాబంధన్ సందర్భంగా రాఖీ పంపిన మహిళకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. రాఖీ పండుగను పురస్కరించుకుని జులై 28న ప్రధాని నరేంద్రమోదీకి, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్‌కు దీప స్పీడ్ పోస్టు ద్వారా రాఖీలు పంపించారు. వాటిని అందుకున్న మోదీ ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌కు చెందిన దీపా మటేలాకు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు.

అన్నాచెల్లెళ్లు ఒకరికొకరు రక్షణగా ఉండాలని తెలిపే భారతీయ సంస్కృతి ఎంతో గొప్పదని మోదీ ఆ లేఖలో పేర్కొన్నారు. రక్షాబంధన్ పండుగ మన మధ్య ఆప్యాయతను పెంచుతుందని అన్నారు. ఇతరుల పట్ల సానుభూతితో వ్యవహరించాలన్న విషయాన్ని కరోనా మనకు నేర్పుతోందని ప్రధాని ఆ లేఖలో తెలిపారు.

Related posts