అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మూడురోజుల ముందే శ్వేతసౌధంలో దీపావళి వేడుకలు చేసుకున్నారు. హిందువులు, జైన్లు, సిక్కులు, బౌద్ధులకు .. ట్రంప్ గ్రీటింగ్స్ చెప్పారు. దీపకాంతుల పండుగను అమెరికాలో జరుపుకోవడం మత స్వేచ్ఛకు నిదర్శనమని ట్రంప్ అన్నారు. శుక్రవారం వైట్హౌజ్లోని ఓవల్ ఆఫీసులో భారతీయ సంతతి ప్రజలతో ట్రంప్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
వివిధ మతవిశ్వాసాలను గౌరవిస్తామని, రాజ్యాంగం కల్పించిన హక్కులను తమ ప్రభుత్వం రక్షిస్తుందని ట్రంప్ అన్నారు. దీపావళి వచ్చేసింది, ఈ పండుగు జరుపుకునే వారందరికీ మెలానీయాతో పాటు తాను కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఆస్ట్రేలియా అధ్యక్షుడు కూడా భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రెండు దేశాలలో భారతీయులు విద్యా-ఉపాధి కోసం భారీ సంఖ్యలో అన్నవిషయం తెలిసిందే.
చంద్రబాబు సెక్యూరిటీ పై స్పందించిన డీజీపీ