విజయవాడలోని కరోనా చికిత్సా కేంద్రంగా వినియోగిస్తోన్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 11కి చేరింది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారికి సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశామని అన్నారు.
ప్రమాదంలో గాయాలపాలైన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని తాము వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించామని ఆళ్ల నాని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరపాలని సీఎం వైస్ జగన్ ఆదేశించారని తెలిపారు. ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుందని చెప్పారు.