మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామ కృష్ణకు అసెంబ్లీ ఫర్నీచర్ తీసుకెళ్లారనే ఆరోపణల కేసులో హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 9వ తేదీలోగా నర్సరావుపేట కోర్టులో లొంగిపోవాలని, ఆ తర్వాత అదే కోర్టు శివరామ్కు బెయిల్ మంజూరు చేయాలని మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు ఉత్తర్వులిచ్చారు.
తుళ్లూరు పోలీసులు పెట్టిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని శివరామకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు చార్జిషీటు వేసే వరకూ పోలీసుల ఎదుట ఆయన హాజరుకావాలి. విజయవాడలోనే నివాసం ఉండాలి. సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు. సాక్ష్యాల్ని తారుమారు చేయకూడద వంటి షరతులను విధిస్తూ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.