telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శృంగారలీలలు అని పేరు పెట్టేసారు అందుకు చాలా బాధ పడ్డా… 30 ఇయ‌ర్స్ పృథ్వీ

Comedian-Prudhvi

ఇటీవల కాలంలో టాలీవుడ్ కమెడియన్ 30 ఇయ‌ర్స్ పృథ్వీ కాంట్ర‌వ‌ర్సీల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిపోతున్నాడు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 30 ఇయర్స్ పృథ్వీని ఎస్వీబీసీ ఛైర్మన్‌గా నియమించారు. అయితే ఛానల్ ఉద్యోగినితో అసభ్యకరంగా మాట్లాడినట్లు ఓ ఆడియో క్లిప్ వైరల్ కావడంతో వివాదం రేగింది. ఆయన్ను ఛైర్మన్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ వినిపించింది. ప్రజా, మహిళా సంఘాలు ధర్నాలు చేశాయి. పృథ్వీరాజ్‌‌ తన పదవికి రాజీనామా చేశారు. వైరల్‌గా మారిన తన ఆడియో టేప్ గురించి పృథ్వీ షాకింగ్ విషయాలు వెల్లడించారు.

నన్ను ఒక్కరు కూడా వచ్చి పలకరించలేదు. నన్ను ఉగ్రవాదిగా చిత్రీకరించారు. నేను మానసికంగా డిస్టర్బ్ అయిపోయి చెట్లకు నీళ్లుపోస్తున్నప్పుడు కిందపడ్డాను చెయ్యి విరిగింది. ఇదివరకు పార్టీలో ఉన్నప్పుడు వైసీపీ వారి గురించి ప్రతిపక్ష పార్టీలు ఎవరు ఏమన్నా కూడా నేను వారిపై అరిచేసేవాడిని. నాకు ఇంతవరకే తెలుసు. నాకు రాజకీయాలు తెలీవు. జగన్మోహన్ రెడ్డిగారు వంద శాతం ఒక కరెక్ట్ రూటులో వెళ్తున్నారు. లంచగొండితనం వద్దు అన్న నియమం పెట్టుకున్నారు. ఆ బాటలో నేను ఒక్క పర్సెంట్ చేయగలగాలి అనుకున్నాను. నాకు ఆయన పాలన టెక్నిక్స్ తెలుసుకోవడానికి మూడు నెలలు పట్టింది. అప్పటికి నేను ఎస్వీబీసీ ఛైర్మన్‌గా ఐదు నెలలు ఉన్నాను. తొమ్మిది నెలల్లో డెలివరీ అంటే అబార్షన్ చేసినట్లు నన్ను ఐదు నెలల్లే తీసి పడేసారు. ఎస్వీబీసీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు నేను పలు ప్రెస్‌మీట్లు పెట్టాను. మీడియా వాళ్లు నన్ను హెచ్చరించారు. తిరుపతిలో రాజకీయాలు ఎలా ఉంటాయో మీకు తెలీవు సర్ అనేవారు. నాకు అప్పుడు అర్థం అయ్యేది కాదు. జగన్ అన్న జెండాతో ఏపీ మొత్తం తిరిగాం. అక్కడంతా లేని రాజకీయం తిరుపతిలో ఏముంటుంది అనుకున్నాను. ఏ కోణంగా ఆలోచించినా కూడా ఓ మనిషి కడుపు మీద కొట్టకూడదు. దెబ్బకు కుటుంబం అంతా చిన్నాభిన్నం అయిపోయింది. రోడ్డు మీదకు వచ్చేసాను. పార్టీలో చెడ్డపేరు తీసుకొచ్చారు. సినిమా రంగంలో మాట్లాడేవారు కూడా పలకరించడంలేదు.

ఆ ఆడియో కాల్‌లో మహిళ గురించి ఎవ్వరూ ఏమీ మాట్లాడటం లేదు. మొన్న ఒంగోలు వెళ్లినప్పుడు ప్రెస్ మీట్ పెట్టాను. మూడు రాజధానులపై మాట్లాడాను. రైతుల ఇబ్బందుల గురించి కూడా మాట్లాడాలను. వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్తు్న్నాను నేను రైతుల గురించి ఏమీ అనలేదు. రైతు ఉద్యమంలో ఉన్న కార్పొరేట్ రైతుల గురించి మాట్లాడాను. వాళ్లను పెయిడ్ ఆర్టి్స్ట్‌లు అన్నాను. నేను రైతుల గురించి తప్పుగా మాట్లాడి ఉంటే.. అదే రైతులు నన్ను తిట్టేవారు కదా. నేను అన్న మాటలను ఓ ఛానెల్‌కు సంబంధించిన వ్యక్తి వక్రీకరించి నా గురించి తప్పు తప్పుగా ప్రచారం చేసేసాడు. నన్ను చెత్తనాకొడకా అన్నాడు. నాకు వెన్నుపోటు పొడుస్తారు అని అప్పుడే నాకు అర్థమైపోయింది. నాపై పోసాని గారు ఎందుకు కోపడ్డారో తెలీలేదు. నాకు ఆయనకు ఎలాంటి గొడవలు లేవు. అలాంటి గొడవలు క్రియేట్ చేసారు. నా ఫ్లెక్సీలు తగలబెట్టారు. అన్నీ ప్లాన్ చేసుకున్నట్లే చేసారు.                                                                                    
నాపై శృంగారలీలలు అని పేరు పెట్టేసారు అందుకు చాల బాధ పడ్డా. నాపేరును చెడగొట్టడానికి కొన్ని లక్షలకు ఖర్చుపెట్టారట. మొన్న కాలినడకన వెళ్లినప్పుడు అక్కడి పూజారులు ఒకే మాట అన్నారు. ‘మీకు స్వామి దర్శనం బాగా జరిగింది. ఆయన మీకు కొన్ని రోజులు సెలవు ప్రకటించారు. ఈ గ్యాప్‌లో మీ చుట్టూ ఎవరు ఎలాంటి వాళ్లో తెలుసుకోండి. అంతా మంచే జరుగుతుంది’ అన్నారు. ఓసారి నా స్నేహితుడు నాకు ఓ యాపిల్ ల్యాప్‌టాప్ కొనిచ్చాడు. నాతో బాగానే మాట్లాడేవాడు. కానీ ఎప్పుడైతే నాపై ఈ ఆడియో టేపులు, కేసులు పెట్టి నన్ను పదవి నుంచి తప్పించారో అతను ఇంటికి వచ్చి ఇచ్చిన కానుకను తీసుకుని వెళ్లిపోయాడు. అలా ఉన్నారు నా చుట్టూ మనుషులు. నేను ఎవరి వల్లైతే నా పదవి పోతుంది అనుకున్నానో వారి వల్లే పోయింది. అయితే ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి ఇదేమీ లంచం తీసుకునే పని కాదు కదా. అలాంటి పనులు నేను చేయను. అలాంటప్పుడు నేను ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. నాకు వైసీపీలో కానీ ఎస్వీబీసీలో కానీ ఎలాంటి శత్రువులు లేరు. ఏదైతేనేంటి.. స్వామి ఆశీస్సులతో నాపై పడిన నింద పోతుందనే అనుకుంటున్నాను అని తెలిపారు.

Related posts