హైదరాబాద్లో జరిగిన దారుణ సంఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. వెటర్నరీ డాక్టర్ను నలుగురు దుర్మార్గులు దారుణంగా రేప్ చేసి తరువాత సజీవ దహనం చేశారు. దీంతో ఒక్కసారిగా ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. ఇలాంటి దారుణాలు ఇక మీదట జరగకుండా గట్టి చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజలు రోడ్డెక్కారు. ఈ దారుణానికి పాల్పడ్డ రాక్షసులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు. అయితే తాజాగా పోలీస్ ఎన్కౌంటర్ లో నిందితులు చావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. కాగా.. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితులు ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులును చటాన్పల్లికి వ్యాన్లో తీసుకెళ్లగా వారు పోలీసులపై రాళ్లు రువ్వి పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా నిందితులు అక్కడికక్కడే మృతి చెందారు. దిశ నిందితుల ఎన్కౌంటర్పై సామాన్య ప్రజానీకం నుంచి సెలబ్రిటీలు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిశకు సరైన న్యాయం జరిగిందంటూ ప్రతి ఒక్కరూ వ్యాఖ్యానిస్తున్నారు. సినీ నటులు సైతం ఈ ఎన్కౌంటర్పై ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. ఈ ఘటనపై ప్రముఖ హీరో రాజశేఖర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సీపీ సజ్జనార్కి హాట్సాఫ్ తెలిపారు. ‘‘న్యాయం జరిగింది. మన ముఖ్యమంత్రికి థాంక్స్ అలాగే మన పోలీస్, సజ్జనార్ గారికి హాట్సాఫ్. నీ ఆత్మకు శాంతి చేకూరాలి దిశ’’ అని రాజశేఖర్ ట్వీట్ చేశారు.
Justice Served. Thank you to our Chief Minister @TelanganaCMO Our Police, Mr. Sajjanar ! Hats off to you.
Rest in peace Disha. pic.twitter.com/84pYvV4WoF— Dr.Rajasekhar (@ActorRajasekhar) 6 December 2019
ఈ భయం చాలా అవసరం#Telanganapolice 🙏🙏#JusticeForDisha
— Anil Ravipudi (@AnilRavipudi) 6 December 2019
Serving justice to #Disha doesn’t stop here but starts from here by preventing such heinous crimes through education, empowerment and enlightenment from childhood. JaiHind. Now Rest in Peace Disha.
— Ravi Teja (@RaviTeja_offl) 6 December 2019
Aaaaaaaaat salute 🙏🏽💪🏽 https://t.co/sZhFiYFbbO
— PURIJAGAN (@purijagan) 6 December 2019
JUSTICE SERVED pic.twitter.com/iO7F6SqlIG
— Allu Arjun (@alluarjun) 6 December 2019