యంగ్ డైరెక్టర్ సుజీత్ కు మెగాస్టార్ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. “లూసిఫర్” రీమేక్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవిని సుజీత్ డైరెక్ట్ చేయనున్నాడు. మలయాళంలో సూపర్ హిట్టైన ‘లూసిఫర్’ రీమేక్ రైట్స్ రామ్ చరణ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ని సెట్స్ పైకి తీసుకెళ్లనుండగా, లాక్ డౌన్ సమయంలో ప్రాజెక్ట్కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడట సుజీత్. తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఇందులో మార్పులు చేసాడని తెలుస్తుంది. ఏడాది చివరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. తాజాగా ఈ సినిమాలోని కీలక పాత్రను జగపతి బాబుతో చేయించేందుకు సుజీత్ చర్చలు జరుపుతున్నాడట. ఈమద్య కాలంలో స్టార్ హీరోల చిత్రాల్లో జగపతి బాబు కీలక పాత్రల్లో కనిస్తున్నాడు. అందుకే ఆయన్ను ఈ చిత్రంలో నటింపజేయడం వల్ల పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారట చిత్రయూనిట్. ఇక ఇటీవల ప్రభాస్ తో “సాహో” అనే చిత్రాన్ని భారీ బడ్జెట్ యాక్షన్ మూవీని తెరకెక్కించాడు సుజీత్. ఈ చిత్రం తెలుగులో అంతగా ఆదరణ పొందకపోయిన హిందీలో మాత్రం మంచి విజయం సాధించింది.
next post