telugu navyamedia
సినిమా వార్తలు

పీవీ సింధుకు చిరంజీవి సత్కారం.. వీడియో వైరల్‌

ఒలింపిక్స్‌లో రెండుసార్లు పతకాలు సాధించి దేశ చరిత్రలో సంచలనం సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్ వీపీ సింధును టాలీవుడ్‌ హీరో మెగాస్టార్‌ చిరంజీవి ప్రత్యేకంగా సత్కరించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సింధును ముఖ్యఅతిథిగా ఆహ్వానించి ఇటీవల ప్రత్యేక వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు నాగార్జునతో పాటు సీనియర్ హీరోయిన్‌ రాధిక, సుహాసిని సహా చిరంజీవి కుటుంబసభ్యులు, ఆత్మీయులు, పలువురు సినీ ప్రముఖులు హాజరై సింధును సన్మానించారు.

ఈ సందర్భంగా సింధు సాధించిన విజయాలను చిరంజీవి కొనియాడారు. సింధును చూసి దేశం మురిసిపోతుంటే తన బిడ్డే అనే భావన కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు. చిరంజీవి కుటుంబం తనపై చూపించిన ప్రేమ, గౌరవాన్ని ఎప్పటికి గుర్తుంచుకుంటానన్న సింధు. వచ్చే ఒలింపిక్స్‌లో తప్పకుండా బంగారు పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది.

సింధు సాధించిన కాంస్య పతకంతో ప్రత్యేకంగా ఫొటోలు దిగుతూ సందడిగా గడిపారు. అమ్మవారి విగ్రహాన్ని బహుకరించి సింధు ఆశీర్వదించారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను చిరంజీవి సోషల్‌ మీడియా ద్వారా మెగా అభిమానులతో పంచుకున్నారు. ఆద్యంతం అలరించేలా, నవ్వులు పంచేలా సాగిన ఆ వీడియోను మీరూ చూసేయండి.

Related posts