telugu navyamedia
Uncategorized ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఎండాకాలం పాదాలు పగులుతున్నాయా.. అయితే ఇలా చేయండి!

ఎండాకాలం రాగానే చెమట సమస్యతో సహా పాదాల పగుళ్ల సమస్య అందరినీ ఇబ్బంది పెడుతుంది.  పాదాల పగుళ్ళు సాదారణము గా పొడి చర్మము ఉన్న వాళ్ళకి , మధుమేహ వ్యాధి గల వారికి ఎక్కువగా కనిపిచి బాధపెడతాయి.

కారణాలు :

శరీరములో అధిక వేడి ,

పొడి చర్మము ,

ఎక్కువ సేపు నిలబడి పనిచేయువారికి ,

కటిన నేలపై నడవడం ,

ఎత్తైన చెప్పులు ధరించి నడవడం ,

అధిక బరువు కలిగిఉండడం ,

పోషకాహార లోపము ,

మధుమేహ వ్యాది ,

నివారణ మార్గాలు :

ముందు కాళ్ళను శుభ్రపరుచుకుని తుడుచుకోవాలి .

పగుల్లపై కొబ్బరి నూనె తో మృదువుగా మర్దన చేసి మందం గా ఉండే సాక్సులు ధరించాలి .

ప్రతిరోజూ ఉదయం పాత బ్రష్ తో రుద్ది గోరువెచ్చని నీటి లో కడిగితే మురికి , మృతకణాలు పోయి నున్న గాతయారవుతాయి .

అరటిపండు ను ముద్దగా చేసుకొని పగుళ్ళ పై రాసి పదినిముసాలు వుంచి తరువాత నీటి తో శుభ్రపరచుకుంటే పాదాలు మెత్త బడతాయి .

గోరువెచ్చని నీటిలో కొంచెము నిమ్మరసం వేసి అందులో పదాలను వుంచి పది నిముషాలు తరువాత మామూలు నీటితో శుభ్రపరచుకుంటే పగుళ్ళ నొప్పి తగ్గుతుంది .

ప్రతి రోజు సాయంత్రం రోజ్ వాటర్ ను పళ్ళెం లో వేసి పది నిముషాలు పాదాలు ముంచి ఉంచితే మృదువు గా తయారవుతాయి .నిమ్మరసము వ్యాజ్ లైన్ వేసిన గోఫువేచ్చని సబ్బు ద్రావనం లో పాదాలను పెట్టి 15 నిముషాలు అయ్యాక పొడి వస్త్రం తో తుడిచి నాణ్యమైన మాయిశ్చరైజర్ రాయాలి .

ఉదయం వేజలైన్‌ తో కాళ్ళను మర్దన చేసుకుంటే పగుళ్ళు మెత్తబడి కొద్దిరోజులకు తగ్గిపోతాయి .రోజు మంచి పోషకాహారము తీసుకోవాలి .

పాదాలు నిర్జీవంగా కనిపించినప్పుడు రెండు టేబుల్‌ స్పూన్ల పటికబెల్లం పొడిలో, పావుకప్పు బొప్పాయి గుజ్జు కలిపి మృదువుగా రుద్దాలి. అలా పావుగంట పాటు చేశాక గోరు వెచ్చని నీళ్లతో కడిగేసుకొని, తడి ఆరనివ్వాలి. ఆ తరువాత కొంచెం ఆలివ్‌ నూనెను తీసుకొని మరోసారి పదినిమిషాల పాటు మర్దన చేస్తే మృదువుగా తయారవుతాయి.

అలాగే మృత-కణాల వల్ల కొన్నిసార్లు పాదాలు కాంతివిహీనంగా కనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడు పావుకప్పు పెసర పిండిలో చెంచా చొప్పున పంచదార, తేనె కలుపుకొని దానిలో బాగా రుద్దితే సరి. తరువాత వేడినీటిలో తువాలును ముంచి, ఆ నీటిని పిండేసి పాదాలకు కప్పాలి. ఇలా తరచూ చేస్తుంటే మురికీ, మృత కణాలూ దూరమవుతాయి.

కాలి పగుళ్లు కొందరిని తరచూ ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటప్పుడు పావుకప్పు చొప్పున బొప్పాయి, కలబంద గుజ్జుల్ని తీసుకుని రెండు చెంచాల గంధం పొడీ, చిటికెడు పసుపూ, చెంచా ఆలివ్‌ నూనె కలిపి మెత్తని పేస్టులా చేసుకుని, దాన్ని పాదాలకు పూతలా వేయాలి.

 

Related posts