బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సోనమ్ కపూర్ అహుజా పెళ్ళైన తరువాత సినిమాలను తగ్గించింది. సోనమ్ ప్రస్తుతం ‘ది జోయా ఫ్యాక్టర్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 20న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సోనమ్కు జోడిగా ‘మహానటి’ ఫేమ్ దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. మరో ముఖ్య పాత్రలో సంజయ్ కపూర్ నటించారు. ఈ సినిమా 2008లో అనుజా చౌహాన్ రాసిన నవల ఆధారంగా రూపొందింది. తాజాగా తన ఆరోగ్యం గురించిన ఓ వార్తను సోనమ్ స్వయంగా బయట పెట్టింది. తనకు ఓ ఆరోగ్య సమస్య ఉందని తన అభిమానులతో పంచుకుంది. ఆమె తన ఇన్స్స్టాగ్రామ్లో రాస్తూ… “తాను అయోడిన్ లోపంతో బాధపడుతున్నట్టు వైద్య పరీక్షల్లో తేలిందని.. కాబట్టి శాఖాహారులందరికీ ఓ రిక్వెస్ట్ అంటూ.. మీరు తినే ఉప్పులో అయోడిన్ ఉండేలా చూసుకోండని కోరింది. నేను కూడా ఇప్పటి నుండి ఉప్పులో అయోడిన్ ఉండేటట్టు చూసుకుంటున్నాను” అని సోనమ్ పేర్కోంది.
previous post