పవన్ కళ్యాణ్ పై కేసు పునర్విచారణకు హైకోర్టులో మహిళా వాలంటీర్ల తరఫున వ్యాజ్యం దాఖలు చేసిన ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్.
వాలంటీర్లపై గత ప్రభుత్వంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇప్పటి ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పై ఇప్పటి కూటమి ప్రభుత్వం కేస్ ఉపసంహరించుకోవడంపై హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేసిన ఇద్దరు మహిళా వాలంటర్లు.
గత ప్రభుత్వంలో 30 వేల మంది మహిళలు కనపడకుండా పోవడానికి వారిని వ్యభిచార కూపంలోకి దించడానికి వాలంటీర్లు కారణమన్న ఆరోపణపై పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు.
అప్పటి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పై కేసు నమోదుకు జీవో కూడా జారీ.
అప్పట్లో గుంటూరు జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రధాన కోర్టులో కేసు దాఖలు చేశారు.
కేసు దాఖలు దరిమిలా పవన్ కళ్యాణ్ కు సమన్లు కూడా జారీ చేసిన గుంటూరులోని నాలుగవ అదనపు జిల్లా కోర్టు.
కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఏ కారణం చూపకుండా పవన్ కళ్యాణ్ పై కేసు ఉపసంహరించుకున్న ప్రభుత్వం.
విజయవాడలోని ప్రజా ప్రతినిధుల కోర్టు మాత్రమే చేయి తగిన పనిని గుంటూరు నాలుగో అదనపు జిల్లా కోర్టు కేసు ఉపసంహరించడం చట్ట విరుద్ధమన్న పిటిషనర్లు.
గుంటూరు జిల్లా కోర్టు పరిధి దాటి పవన్ కళ్యాణ్ పై కేసు ఉపసంహరణకు అనుమతి ఇచ్చింది అన్న పిటీషనర్లు.
30 వేల మంది వాలంటీర్లను అవమానపరిచిన పవన్ కళ్యాణ్ పై ఉపసంహరించుకోవడం ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి అద్దం పడుతుందన్న పిటిషనర్లు.
పిటిషనర్ల తరపున వాదనలు వినిపించనున్న ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్.
అధికారం అడ్డం పెట్టుకుని కేసులు ఉపసంహరించుకోవడం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు వ్యతిరేకమన్న పిటిషనర్లు.
ఈ కేసు రేపు విచారణకు వచ్చే అవకాశం.

