మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాకలో టీఆర్ఎస్ ని ఓడిస్తే సీఎం జనం దగ్గరకు వస్తారని.. 5 వేలకు ఓటేస్తే మేము ఏం చేయలేమన్నారు. మేము మాత్రం ప్రజల కోసం గనంగా కొట్లాడతామని తెలిపారు. LRS ఎవరూ కట్టోద్దని సూచించారు జగ్గారెడ్డి. పోలీసులు లేకుండా… చెంచా గిరి చేసే కలెక్టర్ ని పక్కకు పెట్టి రా అని మంత్రి హరీష్ రావుకు జగ్గారెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ సత్తా ఏందో చూపిస్తామని.. ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు గెలువు చూద్దామని ఫైర్ అయ్యారు.
లాంగ్ స్టాండింగ్ కలెక్టర్ ని ఎన్నికల సమయంలో కొనసాగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. బీజేపీ..టీఆర్ఎస్ ఏకమై ఎన్నికలు జరుపుకుంటున్నారని..అందుకే కలెక్టర్ ని ఎన్నికల కమిషన్ మార్చడం లేదని ఫైర్ అయ్యారు. ఒడిపోతామ నే భయం తోనే హరీష్ దుబ్బాక కి పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ కి కూడా రాకుండా దుబ్బాక లో ఉన్నడంటేనే ఆయనకు భయం పట్టుకుందని అర్థమవుతోందన్నారు.