ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు నేడు జన్మదిన వేడుకులను జరుపుకుంటున్నారు. ఈరోజుతో ఆయన 82వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో ఓ వ్యవసాయ కుటుంబంలో ఆయన జన్మించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రముఖ పారిశ్రామిక వేత్తగా ఎదిగారు. ఆయన జన్మదినం సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ రామోజీరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ట్వీట్ చేశారు.