అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరు క్వారంటైన్లో చికిత్స తీసుకుంటున్నారు. మరో నెల రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా బారినపడడం చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో నవంబరు 3న పోలింగ్ జరగనుంది. అయితే ట్రంప్, మెలానియా కరోనా బారినపడ్డారని తెలియగానే డెమొక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో ఉన్న జో బైడెన్ స్పందించారు. అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా త్వరగా కోలుకోవాలని తన అర్ధాంగి జిల్, తాను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామంటూ బైడెన్ ట్వీట్ చేశారు. దేశాధ్యక్షుడు, ఆయన కుటుంబం ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలని తాము ప్రార్థిస్తూనే ఉంటామని తెలిపారు.
చంద్రబాబే వారిని బీజేపీలోకి పంపారు: తలసాని