అయోధ్య అంశంపై సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తిత్వం విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. మధ్యవర్తిత్వం ద్వారా ఎలాంటి ఫలితాలు రావనే విషయం తమకు ముందే తెలుసని చెప్పారు.
సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విఫలమైందని తెలిపారు. అయినప్పటికీ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం కోసం ప్రయత్నించడం మంచిదేనని చెప్పారు. మహాభారత యుద్ధానికి ముందు కూడా మధ్యవర్తిత్వం జరిగిందని గుర్తు చేశారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదనిఈ విషయం అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు.