telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

త్రికరణ శుద్ధితో నిర్ణయం.. మండలి చైర్మన్ పై గల్లా ప్రశంసలు

galla jayadev got new responsibilities

ఏపీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మరోసారి హర్షం వ్యక్తం చేశారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలన్న చైర్మన్ నిర్ణయంపై ప్రశంసల వర్షం కురిపించారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన నియమాలను అనుసరించారన్నారు.

ఒత్తిళ్లు తట్టుకొని, త్రికరణ శుద్ధితో షరీఫ్ నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. రైతుల హృదయాల్లో ఆవరించిన కారు చీకట్లను తొలగించారని, ‘అధర్మం’ గెలవదని నిరూపించిన షరీఫ్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారంటూ గల్లా ట్విటర్ లో పేర్కొన్నారు.

Related posts