శ్రీనగర్లో ముష్కరులు రెచ్చిపోయారు. విషాక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ప్రముఖ న్యాయవాది, టీవీ ప్యానలిస్ట్ బాబర్ ఖాద్రి మృతి చెండాడు. సాయంత్రం 6.25 గంటల సమయంలో అతడిపై తన హవాల్ నివాసం వద్ద ముష్కరులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన బాబర్ ఖాద్రిని తన స్థానిక స్కిమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు చనిపోయినట్లు ప్రకటించారు.
గత 24 గంటల్లో ఉగ్రవాదులు కాల్చి చంపిన రెండవ రాజకీయ లేదా సామాజిక కార్యకర్తగా ఖాద్రి నిలిచారు. నిన్న రాత్రి బుద్గాం జిల్లాలోని ఖాగ్ ప్రాంతంలోని బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ సభ్యుడు భూపిందర్ సింగ్ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటనల నేపథ్యంలో బీజేపీ నాయకులకు ఉగ్రవాద సంస్థల నుంచి బెదిరింపులు వస్తున్నట్టు తెలుస్తోంది.