ఉత్తరప్రదేశ్లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. రెండు టెంపోలను ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కొల్పాయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన షాహజాన్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.